ఉత్సాహంగా ఫుట్‌బాల్‌ పోటీలు

ABN , First Publish Date - 2021-01-14T06:21:08+05:30 IST

ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలమని, సాధించగలమని ఏఎంసీ చైౖర్మన్‌ మంచెం మైబాబు అన్నారు.

ఉత్సాహంగా ఫుట్‌బాల్‌ పోటీలు

ఏలూరు స్పోర్ట్స్‌, జనవరి 13 : ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలమని, సాధించగలమని ఏఎంసీ చైౖర్మన్‌ మంచెం మైబాబు అన్నారు. బుధవారం ఏలూరు ఏఎస్‌ఆర్‌ స్టేడియంలో జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫుట్‌బాల్‌ పోటీలు నిర్వహించారు. పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌గా బంగారు పతకం సాధించిన పీవీ సింధు అత్యంత కఠోర సాధన ద్వారానే సాధించిందని ఆమె స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. సుమారు ఆరు టీమ్‌లు పాల్గొన్నాయి. విజేతలకు అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆలీబాబా, సెక్రటరీ నవీన్‌, ఉపాధ్యక్షుడు ఎ.ప్రసాద్‌ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బండారు కిరణ్‌కుమార్‌, రిటైర్డ్‌ డీఎస్పీ ఎ.జయరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T06:21:08+05:30 IST