ఫుట్‌బాల్‌ లీగ్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-25T04:22:13+05:30 IST

ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ లీగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రారంభమయ్యాయి. నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకనాఽథ్‌ ఈ పోటీలను ప్రారంభించి మాట్లాడారు.

ఫుట్‌బాల్‌ లీగ్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభం
క్రీడాకారులతో నుడా చైర్మన్‌ తదితరులు

నెల్లూరు (క్రీడలు), అక్టోబరు 24 : ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ లీగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రారంభమయ్యాయి. నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకనాఽథ్‌ ఈ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మొత్తం 12 ఫుట్‌బాల్‌ క్లబ్‌లను ఆహ్వానించి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి శనివారం, ఆదివారం ఈ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సెట్నల్‌ సీఈవో పుల్లయ్య, డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ ఆర్‌కే యతిరాజ్‌, ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి బీ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T04:22:13+05:30 IST