Basara IIITలో ఫుడ్ పాయిజనింగ్
ABN , First Publish Date - 2022-07-15T23:24:05+05:30 IST
బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిన్న 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
బాసర: బాసరలోని ట్రిపుల్ ఐటీ (Basara IIIT)లో కలుషిత ఆహారం (food poisoning) తిన్న 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో విద్యార్థులు బాధపడుతున్నారు. పీయూసీ1, పీయూసీ 2 మెస్లల్లో ఈ ఘటన జరిగింది. క్యాంపస్లోని ఆస్పత్రిలో కొంతమంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. మరికొంత మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజనింగ్కి దారి తీసిన కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.