మధుమేహుల భోజనం ఇలా...

ABN , First Publish Date - 2021-01-12T17:29:49+05:30 IST

రోజుకు మూడు పూటలా భోజనం మధుమేహులకు వర్తించదు. రక్తంలో చక్కెర మోతాదును అదుపులో ఉంచుకోవడమే ప్రధాన ప్రక్రియగా మధుమేహుల దైనందిన జీవితం సాగుతూ ఉంటుంది

మధుమేహుల భోజనం ఇలా...

ఆంధ్రజ్యోతి(12-01-2020)

రోజుకు మూడు పూటలా భోజనం మధుమేహులకు వర్తించదు. రక్తంలో చక్కెర మోతాదును అదుపులో ఉంచుకోవడమే ప్రధాన ప్రక్రియగా మధుమేహుల దైనందిన జీవితం సాగుతూ ఉంటుంది. వీరిలో చక్కెర స్థాయి హఠాత్తుగా పడిపోతే నాడీవ్యవస్థ ఒడిదొడుకులకు లోనై మూర్ఛపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీరు రోజంతా చక్కెర స్థాయిలు స్థిరంగా కొనసాగడానికి తోడ్పడేలా ఆహార నియమాలు కొనసాగించాలి. ఇందుకోసం....


టైప్‌2 డయాబెటిస్‌: రోజు మొత్తంలో ఎక్కువసార్లు తక్కువ పిండిపదార్థాలు తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయిని నిలకడగా ఉంచుకోవడం ఈ కోవకు చెందినవారు చేయవలసిన పని. ఒకేసారి భారీ భోజనం చేస్తే మందులు తీసుకుంటున్నా, చక్కెర విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పిండిపదార్థాలు, గ్లూకోజ్‌ పరిమాణాలు రోజంతా సమంగా అందేలా స్వల్ప పరిమాణాల్లో, స్వల్ప విరామాలతో ఆహారం తీసుకోవాలి.


Updated Date - 2021-01-12T17:29:49+05:30 IST