పేదలకు ఆహారం పంపిణీ
ABN , First Publish Date - 2021-06-13T05:30:00+05:30 IST
కరోనా నేపథ్యంలో కందుకూరు పట్టణంలో పలు స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఆహారం పంపిణీ చేశారు.
కందుకూరు, జూన్ 13: కరోనా నేపథ్యంలో కందుకూరు పట్టణంలో పలు స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఆహారం పంపిణీ చేశారు. అమ్మ-నాన్న ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకుడు కరేటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక అంకమ్మ దేవాలయం ఎదుట పేదలకు ఆహారం పంపిణీ చేశారు. బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం డి. అనూరాధ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాఽధ్యాయుడు పొతకమూరి కృష్ణయ్య సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కరేటి వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో కె. శ్రీహరి, పి.రామలత, కె.దివ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కందుకూరుశాఖ ఆధ్వర్యంలో మండలంలోని మోపాడు ఎస్టీ కాలనీ, మున్సిపాలిటీ పరిధిలోని ఆనందపురం ఎస్టీ కాలనీలలో పేదలకు ఆదివారం ఆహారం ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్, సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు వై.ఆనంద్మోహన్, కె.హరిబాబు, బి. చంద్రమోహన్, బి.సురే్షబాబు, పి. బాలకోటయ్య, రమణ , మణికంఠ, గోపి, అనిల్, ఆముదాలపల్లి వెంకటేశ్వర్లు, ప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వాసవీ సేవాదళ్ ఆధ్వర్యంలో బాలుర ఉన్నత పాఠశాల ఎన్సీసీ ఆఫీసర్ కేశినేని వెంకటేశ్వర్లు సహకారంతో ముప్పాళ్ల హైస్కూల్ హెచ్ఎం ఆర్.వెంకటేశ్వర్లు (ఆర్వీ) చేతుల మీదుగా ఆదివారం పేదలు, యాచకులకు ఆహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో చక్కా వెంకటకేశవరావు, చలంచర్ల సుబ్బారావు, కోలా చంద్రశేఖర్, ఇస్కాల మధు, చిత్తారు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.