కొవిడ్ నిబంధనలు పాటించండి
ABN , First Publish Date - 2021-04-13T05:53:54+05:30 IST
కరోనా సెకండ్వేవ్ను నియంత్రించాలంటే తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని పరిగి తహసీల్దార్ సౌజన్యలక్ష్మీ అన్నారు.
హిందూపురం టౌన, ఏప్రిల్ 12: కరోనా సెకండ్వేవ్ను నియంత్రించాలంటే తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని పరిగి తహసీల్దార్ సౌజన్యలక్ష్మీ అన్నారు. సోమవారం పరిగిలో కిరాణాషాపులు, ఆటో డ్రైవర్లు, మెడికల్ షాపు నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలలో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. కిరాణాషాపుల్లో ఎవరైనా మాస్కులేకుండా వస్తే సరుకులు ఇవ్వరాదన్నారు. మెడికల్ షాపులో కూడా ఇదే నిబంధనలు పాటించాలన్నారు. ఆటోలో ప్రతిఒక్కరూ మాస్కు ధరిస్తేనే ఎక్కించుకోవాలన్నారు. లేదంటే ఆటోలను గుర్తించి సీజ్ చేస్తామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించనివారిపై పంచాయతీ సిబ్బంది, పోలీసులతో కలిసి జరిమానాలు విధిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామాంజనేయులు, ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.