లాక్‌డౌన్‌లో వయసైపోతున్న బాడీపై దృష్టి పెట్టా: అశ్విన్

ABN , First Publish Date - 2021-02-27T10:30:10+05:30 IST

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టుల్లో ఇరగదీస్తున్నాడు. లాక్‌డౌన్‌ తర్వాత క్రికెట్ మళ్లీ మొదలైన తర్వాత జరిగిన ఆటలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. దీనికి కారణమేంటా?

లాక్‌డౌన్‌లో వయసైపోతున్న బాడీపై దృష్టి పెట్టా: అశ్విన్

చెన్నై: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టుల్లో ఇరగదీస్తున్నాడు. లాక్‌డౌన్‌ తర్వాత క్రికెట్ మళ్లీ మొదలైన తర్వాత జరిగిన ఆటలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. దీనికి కారణమేంటా? అని ఆరా తీస్తే ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సీక్రెట్ స్వయంగా అశ్వినే బయటపెట్టేశాడు. 34 ఏళ్ల అశ్విన్ ఇటీవలే టెస్టుల్లో అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన ఇండియన్ బౌలర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీని గురించే మాట్లాడిన అశ్విన్.. లాక్‌డౌన్ సమయంలో వయసు పెరుగుతున్న తన శరీరంపై దృష్టి పెట్టానని, 7-8 కేజీల బరువు తగ్గానని వెల్లడించాడు. ఇటీవలి కాలంలో తన ఫామ్‌‌పై ప్రశ్నించగా ఇదో అద్భుతమైన కలల ప్రపంచంలా సాగిపోతోందని చెప్పాడు.

Updated Date - 2021-02-27T10:30:10+05:30 IST