మారుమూల గిరిగ్రామాల అభివృద్ధిపై దృష్టి
ABN , First Publish Date - 2022-01-15T05:45:27+05:30 IST
గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు.
జడ్పీ చైర్పర్సన్ సుభద్ర
ముంచంగిపుట్టు, జనవరి 14: గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. శుక్రవారం మండలంలోని జర్జుల పంచాయతీలో పర్యటించి, కులబీరు గ్రామంలో రిబ్బన్ కట్ చేసి నూతన తాగునీటి పథకాన్ని, వీధి దీపాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎ. సీతమ్మ, వైస్ ఎంపీపీ భాగ్యవతి పాల్గొన్నారు.