బడ్జెట్పై శ్రద్ధ పెట్టండి
ABN , First Publish Date - 2020-12-05T10:16:00+05:30 IST
బడ్జెట్ తయారీపై శ్రద్ధ పెట్టాలని, అంచనాలు సరిగ్గా రూపొందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖకు కాగ్ అక్షింతలు వేసింది. అంచనాలకు, వాస్తవాలకు మధ్య రూ. వేల కోట్ల తేడా ఉంటోందని అభిప్రాయపడింది.
ఆర్థిక శాఖకు కాగ్ అక్షింతలు
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): బడ్జెట్ తయారీపై శ్రద్ధ పెట్టాలని, అంచనాలు సరిగ్గా రూపొందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖకు కాగ్ అక్షింతలు వేసింది. అంచనాలకు, వాస్తవాలకు మధ్య రూ. వేల కోట్ల తేడా ఉంటోందని అభిప్రాయపడింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరిరోజైన శుక్రవారం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదిక సభలో ప్రవేశపెట్టారు. ఆ ఏడాది అంచనా వేసిన ఆదాయానికి, వాస్తవ రాబడికి మధ్య 40,836 కోట్ల రూపాయల భారీ తేడా ఉన్నట్లు కాగ్ పేర్కొంది. అదే విధంగా పెట్టుబడుల వ్యయం రాష్ట్ర స్థూల ఉత్పతితో కేవలం 2.14 శాతం మాత్రమే ఉందని వెల్లడించింది.
2018-19లో మొత్తం రెవెన్యూ వ్యయం 1,28,570 కోట్ల రూపాయల్లో కమిటెడ్ వ్యయం రూ.68,225 కోట్లకు పెరిగినట్లు వివరించింది. ప్రభు త్వం సబ్సిడీలు తగ్గించడమే దీనికి కారణమని కాగ్ స్పష్టం చేసింది. వేస్ అండ్ మీన్స్ వాడుకున్నందుకుగానూ 2017-18లో రూ.44 కోట్లు, 2018-19లో రూ. 64కోట్లు ఆర్బీఐకి ప్రభుత్వం వడ్డీ చెల్లించిందని వివరించింది. అలాగే, బడ్జెట్లో కేటాయించకుండా రూ.2,790 కోట్లు అదనంగా ఖర్చు చేశారని వెల్లడించింది. ఈ విషయాలపై ఆర్థిక శాఖ దృష్టి సారించాలని, ప్రత్యేక అధికారులను నియమించుకుని వ్యయ నిర్వహణ మెరుగుపరచుకోవాలని సూచించింది.