పారిశుధ్యంపై దృషి సారించండి

ABN , First Publish Date - 2021-02-25T05:18:19+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు పారిశుధ్యం మెరుగుపరిచేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆసుపత్రి కమిటీ సమావేశం నిర్వహించారు.

పారిశుధ్యంపై దృషి సారించండి
ఆసుపత్రిలో సమావేశం నిర్వహిస్తున్న దృశ్యం

సోంపేట : ప్రభుత్వ ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు పారిశుధ్యం మెరుగుపరిచేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆసుపత్రి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు వైద్యుల బిల్లులు చెల్లించేందుకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలను, వార్డులను పరిశీలించారు. సరైన మార్చురీ గది లేకపోవడంతో డీఈతో మాట్లాడి... సమస్య పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లక్ష్మీనారాయణ, వైద్యులు రాజేంద్రప్రసాద్‌, రామకృష్ణ, రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T05:18:19+05:30 IST