‘ఆన్లైన్ విద్యపై దృష్టి పెట్టాలి’
ABN , First Publish Date - 2020-09-30T06:34:50+05:30 IST
ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధనపై ఉపాధ్యాయలు ప్రత్యేక దృష్టి సా రించాలని డీఈవో వాసంతి సూచించారు. మంగళవారం
నెక్కొండ, సెప్టెంబరు 29 : ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధనపై ఉపాధ్యాయలు ప్రత్యేక దృష్టి సా రించాలని డీఈవో వాసంతి సూచించారు. మంగళవారం నెక్కొండ హైస్కూల్, సీపీఎస్ పాఠశాలలను ఆకస్మిక తనిఖి చేశారు. డీఈవో మాట్లాడుతూ ఉపాధ్యాయలు విద్యార్థులు ఆన్లైన్ విద్యను ఎంతవరకూ వింటున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు పాఠ్యంశాలకు సంబంధించిన ప్రశ్నలను వేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో రత్నమాల, హెచ్ ఎం ఇక్బాల్, నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు యాకయ్య, రమ ణ, వాణి, తిరుపతిరెడ్డి, నజీరోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.