మున్సిపాలిటీలో మౌలిక వసతులపై దృష్టి

ABN , First Publish Date - 2022-07-02T05:02:51+05:30 IST

అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు దృష్టి కేంద్రీకరించినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చెప్పారు.

మున్సిపాలిటీలో మౌలిక వసతులపై దృష్టి
పూరీ జగన్నాథుడి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు

  ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి


పటాన్‌చెరు, జులై 1: అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు దృష్టి కేంద్రీకరించినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చెప్పారు. గురువారం మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డితో కలిసి మున్సిపల్‌ కార్యాలయ అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దచెరువు కట్టపై దర్గాను ప్రారంభించి, మసీదు రెండవ అంతస్తుకు శంకుస్థాపన చేశారు. నరేంద్ర కాలనీలో రామాలయం నిర్మాణానికి రూ.పది లక్షల విరాళం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలో ఐదెకరాల్లో మినీ స్టేడియం, మార్కెడ్‌యార్డ్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, కమిషనర్‌ సుజాత పాల్గొన్నారు.


పూరీజగన్నాథస్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే


జిన్నారం: బొల్లారం మున్సిపాలిటీలో పూరీ జగన్నాథస్వామి ఆలయ రథోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొని తాడును లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు చంద్రారెడ్డి, హన్మంతరెడ్డి, మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, నాయకులు వరప్రసాద్‌రెడ్డి, ఉత్సవ నిర్వాహకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-07-02T05:02:51+05:30 IST