సీఎం సభ ఏర్పాట్లపై దృష్టి

ABN , First Publish Date - 2022-08-18T06:30:19+05:30 IST

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 24న చీమకుర్తి రానున్న నేపథ్యంలో ఆయన పర్యటన విజయవంతంపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టిసారించారు.

సీఎం సభ ఏర్పాట్లపై దృష్టి
చీమకుర్తిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ మలికగర్గ్‌, ఎమ్మెల్యే బాలినేని తదితరులు

జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మతో కలిసి పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ, బాలినేని 

చీమకుర్తి, ఆగస్టు 17: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 24న చీమకుర్తి రానున్న నేపథ్యంలో ఆయన పర్యటన విజయవంతంపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టిసారించారు. సన్నాహక సమావేశాన్ని బుధవారం పట్టణంలోని బీవీఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జడ్పీ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ మలికగర్గ్‌, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌ పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. సభాస్థలి, హెలిప్యాడ్‌ కోసం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బీవీఎస్‌ఆర్‌ కళాశాల స్థలాలను పరిశీలించారు. బీవీఎస్‌ఆర్‌ కల్యాణమండపం సమీపంలో మాజీ సీఎం వైఎస్సార్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల విగ్రహాల ఏర్పాటు కోసం జరుగుతున్న పనులను పరిశీలించారు. టూర్‌ షెడ్యూల్‌, రూట్‌మ్యాప్‌పై ప్రాఽఽథమికంగా చర్చించారు. విగ్రహావిష్కరణ తదుపరి కళాశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.




Updated Date - 2022-08-18T06:30:19+05:30 IST