ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి
ABN , First Publish Date - 2022-05-17T06:42:58+05:30 IST
ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, దీనిపై రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించాల ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. మంత్రి జగదీ్షరెడ్డి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డితో కలిసి సోమవారం నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడా రు.
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి
సూర్యాపేట(కలెక్టరేట్), మే 16: ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, దీనిపై రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించాల ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. మంత్రి జగదీ్షరెడ్డి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డితో కలిసి సోమవారం నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. జిల్లాలో ఇప్పటికే 561 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగవుతోందని, రాను న్న రోజుల్లో రైతులు ఉద్యాన పంటలు ఎక్కువగా సాగు చేయాలన్నారు. జిల్లాలో వేరుశనగ, కందులు, నిమ్మ, అరటి సాగును పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉత్సాహం చూపించే రైతులను మహారాష్ట్రలోని జల్గావ్కు తీసుకెళ్లాలని సూచించా రు. సమావేశంలో సూర్యాపేట మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలిత, డీఏవో రామారావునాయక్, ఉద్యానవనశాఖాధికారి బి.శ్రీధర్, డీఎంవో సంతోష్, మార్కెట్ కార్యదర్శి ఎండి.ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.