ఫామ్హౌస్లో కంప్యూటర్ ఇంజనీర్ మృతి
ABN , First Publish Date - 2021-10-26T13:20:51+05:30 IST
మహాబలిపురం సమీపంలోని ఫామ్హౌస్లో కంప్యూటర్ ఇంజనీర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. స్థానిక హస్తినాపురానికి చెందిన సుదర్శన్ (39) అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేశారు. కరోనా వైరస్
చెన్నై(Tamilnadu): మహాబలిపురం సమీపంలోని ఫామ్హౌస్లో కంప్యూటర్ ఇంజనీర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. స్థానిక హస్తినాపురానికి చెందిన సుదర్శన్ (39) అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా యేడాదికి ముందే సుదర్శన్ చెన్నైకి తిరిగివచ్చారు. మహాబలిపురం సమీపంలోని పట్టిపుల్లమ్ ఫామ్హౌస్లో స్నేహితులతో కలిసి ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఫామ్హౌస్లోని ఓ గదిలో తలకు గాయమైన స్థితిలో శవమై పడి వుండగా పోలీసులు కనుగొన్నారు. సుదర్శన్ మెట్ల మీద నుంచి దిగుతూ జారిపడి మృతిచెందాడా? లేక స్నేహితులతో గొడవలు జరిగిన దాడిలో హత్యకు గురై ప్రాణాలు కోల్పోయాడా? అనే కోణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సుదర్శన్తో బసచేసిన స్నేహితుల వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.