కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న నిర్మలా సీతారామన్
ABN , First Publish Date - 2021-03-04T22:34:17+05:30 IST
కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: తాను కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. తనకు కోవిడ్-19 టీకా వేసిన నర్సు రమ్యకు కేంద్ర ఆర్థిక మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు.
మరో వైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కోవిడ్-19 నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడంతో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కొంత మేరకు తగ్గాయి. అయితే ఇటీవల కాలంలో మళ్లీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.