పక్కనే తండ్రి శవం పెట్టుకుని.. కూతురు చేసిన పనికి నోరెళ్లబెడుతున్న జనం.. ఏంటి ఈ పాడు పని అంటూ..

ABN , First Publish Date - 2021-10-29T23:10:36+05:30 IST

కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు సాధారణంగా ఎవ్వరైనా భావోద్వేగానికి లోనవుతాం. వారితో గడిపిన క్షణాలను తలచుకుని బాధపడుతుంటాం. అయితే ఓ యువతి మాత్రం అలా చేయలేదు. పక్కనే తండ్రి శవాన్ని పెట్టుకుని.. అందరూ అసహ్యించు

పక్కనే తండ్రి శవం పెట్టుకుని.. కూతురు చేసిన పనికి నోరెళ్లబెడుతున్న జనం.. ఏంటి ఈ పాడు పని అంటూ..

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు సాధారణంగా ఎవ్వరైనా భావోద్వేగానికి లోనవుతాం. వారితో గడిపిన క్షణాలను తలచుకుని బాధపడుతుంటాం. అయితే  ఓ యువతి మాత్రం అలా చేయలేదు. పక్కనే తండ్రి శవాన్ని పెట్టుకుని.. అందరూ అసహ్యించుకునే పని చేసింది. అంతేకాకుండా.. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో స్వయంగా ఆమె పోస్ట్ చేసింది. ఆ ఫొటోలను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. పక్కనే తండ్రి శవాన్ని పెట్టుకుని ‘నువ్వేం చేశావో నీకైనా అర్థమవుతుందా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన జేన్ రివేరాకు ప్రస్తుతం 20ఏళ్లు. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. గత కొన్నేళ్లుగా ఆర్మీ అధికారిగా పని చేసిన ఆమె తండ్రి ఈ మధ్యే రిటైర్ అయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో కొద్ది రోజుల క్రితం కన్నుమూశారు. దీంతో కుటుంబ సభ్యులు.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగానే అక్కడ ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నలుపు రంగులో ఉన్న డ్రెస్‌లో జేన్ రివేరా అక్కడకు ఎంట్రీ ఇచ్చింది. తండ్రి మృతదేహం శవపేటికలో ఉండగా.. శవపేటికను ఓపెన్ చేసి,  ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతేకాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవికాస్తా వైరల్ కావడంతో.. జేన్ రివేరా చేసిన పనికి నెటిజన్లు షాకవుతున్నారు. ‘పక్కనే తండ్రి శవాన్ని పెట్టుకుని ఏంటి ఈ పాడు పని’ అని కామెంట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జేన్ రివేరా.. తన ఇన్‌స్ట్రా‌గ్రాం అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. 




Updated Date - 2021-10-29T23:10:36+05:30 IST