కాజ్వేపై వరద నీరు.. రాకపోకలకు బేజారు
ABN , First Publish Date - 2022-08-18T05:41:09+05:30 IST
బూర్జపాడు- డొంకూరు మధ్య ఉప్పుటేరు వద్ద ఉన్న కాజ్వేపై వరద నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులు, రైతులు, కూలీలు, ద్విచక్ర వాహన చోదకులు అవస్థలకు గురవుతున్నారు.
సముద్రంలోకి మళ్లింపునకు చర్యలు తీసుకోని అధికారులు
ప్రజలకు తప్పని ఇబ్బందులు
ఇచ్ఛాపురం రూరల్: బూర్జపాడు- డొంకూరు మధ్య ఉప్పుటేరు వద్ద ఉన్న కాజ్వేపై వరద నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులు, రైతులు, కూలీలు, ద్విచక్ర వాహన చోదకులు అవస్థలకు గురవుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఊప్పుటేరు వద్ద నీటి ఉధృతి కొనసాగుతోంది. మూడురోజులుగా వరద తగ్గడంలేదు. ఇక్కడ నీటిని సముద్రం లోకి అధికారులు మళ్లింపునకు చర్యలు తీసుకోవడంలేదని తీరప్రాంత వాసులు, విద్యార్థులు, రైతులు, కూలీలు వాపోతు న్నారు. కాగా తహసీల్దార్ ఎం.లావణ్య మంగళవారం కాజ్వే వద్ద పరిశీలించిన విషయం విదితమే. నీటిని మళ్లించాలని సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులకు ఆమె సూచించి వెళ్లిపోయారు. అఽధికారులు తక్షణమే స్పందించి పొగురుతీత పనులు చేపట్టి నీటిని సముద్రంలోకి మళ్లించాలని రైతులు కోరుతున్నారు.
సముద్రంలోకి నీటిని మళ్లించాలి
బూర్జపాడు వద్ద వరదనీటిలో మునిగిన నాట్లను వ్యవసాయాధికారి బి.నరసిం హమూర్తి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిని సముద్రంలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని సర్పం చ్ బి.మోహ నాంగి, తహసీల్దార్ను కోరారు. గురువారం నాటికి నీరు తొలగిస్తే పంటలకు ఇబ్బంది ఉండదన్నారు. పొలాల్లో నీరు బయటకు వెళ్లిన వెంటనే యూరియా, పొటాష్తో బూస్టర్ మోతాదు ఎరువులు వేస్తే వరిపైరు సాధారణ స్థితికి వస్తుందని రైతులకు సూచించారు.