బెజ్జూరు మండలాన్ని వదలని వరద

ABN , First Publish Date - 2022-08-19T04:11:56+05:30 IST

నెలరోజులుగా బెజ్జూరు మండల వాసులను వరదలు వదలడం లేదు. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టుల నుంచి నీటిని వదులుతుండడంతో భారీగా వరద నీరు పొలాల్లోకి చేరి పంటలను ముంచుతున్నాయి.

బెజ్జూరు మండలాన్ని వదలని వరద
నీట మునిగిన వంతెన

- ప్రాణహిత ఉగ్రరూం

బెజ్జూరు, ఆగస్టు 18: నెలరోజులుగా బెజ్జూరు మండల వాసులను వరదలు వదలడం లేదు. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టుల నుంచి నీటిని వదులుతుండడంతో భారీగా వరద నీరు పొలాల్లోకి చేరి పంటలను ముంచుతున్నాయి. ప్రాణహితకు వరద కారణంగా 12గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని రాకపోకలు స్తంభించాయి. తలాయి, పాత సోమిని మధ్య నిర్మించి వంతెన పూర్తిగా నీట మునడంతో తలాయి, పాపన్నపేట గ్రామాల మధ్యరాకపోకలు నిలిచిపోయాయి. సర్వం కోల్పోయా మంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2022-08-19T04:11:56+05:30 IST