శ్రీరాంసాగర్‌కు మళ్లీ పెరిగిన వరద

ABN , First Publish Date - 2021-08-29T01:58:38+05:30 IST

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీరాంసాగర్‌లోకి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరడంతో

శ్రీరాంసాగర్‌కు మళ్లీ పెరిగిన వరద

నిజామాబాద్‌: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీరాంసాగర్‌లోకి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరడంతో అధికారులు శనివారం ఎస్సారెస్పీ నాలుగు గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి నీటిని వదిలారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 21460 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి 12480 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. కాగా.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు కాగా.. ప్రస్తుతం 1090 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. 

Updated Date - 2021-08-29T01:58:38+05:30 IST