సాగర్ జలాశయానికి తగ్గిన వరద
ABN , First Publish Date - 2021-09-19T00:37:13+05:30 IST
నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువనుంచి వరద రాక తగ్గడంతో శనివారం ఉదయం ప్రాజెక్టు
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువనుంచి వరద రాక తగ్గడంతో శనివారం ఉదయం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మూసివేశారు. గురువారం సాయంత్రం నుంచి సాగర్కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద రాక మొదలవడంతో శుక్రవారం ఉదయం 3 గంటలకు సాగర్ 12 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి వరద రాక క్రమంగా తగ్గడంతో సాగర్ గేట్లను మూసివేశారు. శనివారం ఉదయం సాగర్కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మూసివేయడంతో వరద రాక తగ్గింది. దీంతో సాగర్ గేట్లను కూడా మూసివేశారు.