మళ్లీ వరద

ABN , First Publish Date - 2022-08-15T06:19:17+05:30 IST

మళ్లీ వరద

మళ్లీ వరద
నాగాయలంకలోని శ్రీరామపాద పుష్కర ఘాట్‌లో వరద నీరు

తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉధృతంగా కృష్ణమ్మ

బ్యారేజీకి ఇన్‌ఫ్లో 3.37 లక్షల క్యూసెక్కులు

విజయవాడ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో తగ్గినట్టే తగ్గి ఆదివారం మళ్లీ పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి 3 లక్షల 37 వేల 469 క్యూసెక్కుల నీరు వస్తోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి 3 లక్షల 31 వేల 961 క్యూసెక్కుల నీరు బ్యారేజీని తాకింది. పాలేరు నుంచి 1,271 క్యూసెక్కులు, కీసర నుంచి 4,237 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. బ్యారేజీ 50 గేట్లను ఎనిమిది అడుగుల మేర పైకెత్తారు. మరో 20 గేట్లను ఏడడుగుల మేర ఎత్తి 3 లక్షల 22వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. 


Updated Date - 2022-08-15T06:19:17+05:30 IST