ప్రమాదకరంగా బాతుల చెరువు అలుగు
ABN , First Publish Date - 2020-10-23T10:00:25+05:30 IST
వర్షాలు రాక రెండు రోజులవుతున్నా హయత్నగర్ జంట చెరువులకు, మునగనూరు కల్వర్టుకు వరద ప్రవాహం ఆగడం లేదు.
హయత్నగర్, అక్టోబర్ 22 (ఆంధ్రజ్యోతి): వర్షాలు రాక రెండు రోజులవుతున్నా హయత్నగర్ జంట చెరువులకు, మునగనూరు కల్వర్టుకు వరద ప్రవాహం ఆగడం లేదు. ఇంజాపూర్ జిలాంఖాన్ చెరువు నుంచి నేటికీ భారీగా వరద వస్తుండడంతో మునగనూర్ కల్వర్టు వద్ద రోడ్డు దాటడం ప్రమాదకరంగా మారింది. వనస్థలిపురం నుంచి వచ్చే వరద తగ్గకపోవడంతో బాతుల చెరువు అలుగు నేటికీ ప్రమాద భరితంగానే ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం దాటికి మునగనూర్కు వెళ్లే రహదారి మొ త్తం కోతకు గురైంది. వాహనదారులు మాత్రం అందులో నుంచి వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. గురువారం ఓ ఆటో అం దులో పడగా స్థానికులు బయటకు తీశారు. సగం రోడ్డు ధ్వంసం కావడంతో రోడ్డుకు ఇరువైపు లా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలుగు దాటడానికి సుమారు 30 నిమిషాల సమయం పడుతోంది.