Alluri Sitaramaraju జిల్లాలో వరద బీభత్సం
ABN , First Publish Date - 2022-07-14T17:19:41+05:30 IST
అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. విలీన మండలాలు జల దిగ్బంధంలో ఉండిపోయాయి.
రాజమండ్రి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. విలీన మండలాలు జల దిగ్బంధంలో ఉండిపోయాయి. అంతకంతకూ వరద ఉదృతి పెరుగుతోంది. ఎటపాక పోలిస్ స్టేషను వరద నీరు చుట్టుముట్టింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు ఎత్తైన ప్రదేశాలకు తరలిపోతున్నారు. అటు అల్లూరి జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ చింతూరులోనే మకాం వేశారు. పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని బాధితులకు అధికారులు సూచిస్తున్నారు.