శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి
ABN , First Publish Date - 2020-09-22T15:33:26+05:30 IST
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు చెందిన 10 గేట్లను 10 అడుగుల మేర అధికారులు ఎత్తివేశారు.
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు చెందిన 10 గేట్లను 10 అడుగుల మేర అధికారులు ఎత్తివేశారు. ఇన్ ఫ్లో : 3,37,730 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 3 లక్షల 05 వేల 486 క్యూసెక్కులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం : 884.50 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం :212.9198 టీఎంసీలకు చేరుకుంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.