ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద
ABN , First Publish Date - 2021-08-06T06:28:13+05:30 IST
ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద
విజయవాడ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద ఉధృతి మొదలైంది. ఎగువ నుంచి ఇన్ఫ్లో క్రమంగా తగ్గుతున్న తరుణంలో.. పులిచింతల ప్రాజెక్టు వద్ద సాంకేతిక అంతరాయం ఏర్పడింది. ఆ ప్రాజెక్టు 16వ నెంబర్ గేటు అదుపు తప్పి కొట్టుకుపోయింది. ఫలితంగా నీరు వేగంగా దిగువకు ప్రవహిస్తోంది. పులిచింతల నుంచి గురువారం 5లక్షల క్యూసెక్కులను వదిలారు. దీంతో బ్యారేజీ వద్ద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. 55 గేట్లను రెండు అడుగులకు, 15 గేట్లను మూడడుగులకు ఎత్తి లక్షా13వేల750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా పల్లపు ప్రాంతాలకు, నదీ పరివాహక ప్రాంతాలకు మళ్లీ ముంపు రానుంది.