ఫ్లాట్ల కొనుగోలుదారులకు కర్ణాటక సీఎం గుడ్ న్యూస్!

ABN , First Publish Date - 2021-03-09T01:28:47+05:30 IST

తొలిసారి ఫ్లాట్ కొనుగోలు చేసే వారికి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప శుభవార్త చెప్పారు.

ఫ్లాట్ల కొనుగోలుదారులకు కర్ణాటక సీఎం గుడ్ న్యూస్!

బెంగళూరు: తొలిసారి ఫ్లాట్ కొనుగోలు చేసే వారికి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప శుభవార్త చెప్పారు. రూ. 35 నుంచి రూ. 45 లక్షల మధ్య ఉన్న ఫ్లాట్ కొనుగోలు చేస్తే స్టాంప్ డ్యూటీలో 2 శాతం కోత విధిస్తామన్నారు. బడ్జెట్ 2021-22ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, అపార్ట్‌మెంట్ల తొలి రిజిస్ట్రేషన్‌కు మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. సరసమైన ధరలకే గృహాలను సొంతం చేసుకునే అవకాశం కల్పించడంలో భాగంగానే స్టాంప్ డ్యూటీలో 2 శాతం కోత విధిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో స్టాంప్ డ్యూటీ ప్రస్తుతం 5 శాతంగా ఉంది. డెవలపర్ల నుంచి కొత్తగా ఫ్లాట్లు కొనుగోలు చేసే వారికి తొలి రిజిస్ట్రేషన్‌కు మాత్రమే స్టాంప్ డ్యూటీ తగ్గుతుందని సీఎం వివరించారు. రెండోసారి రిజిస్ట్రేషన్ సమయంలో మాత్రం పూర్తి స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని యడియూరప్ప స్పష్టం చేశారు.

Updated Date - 2021-03-09T01:28:47+05:30 IST