జాతీయ జెండాను ఆవిష్కరించిన కన్నా..
ABN , First Publish Date - 2020-08-15T16:00:40+05:30 IST
గుంటూరు: రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జాతీయ జండాను ఆవిష్కరించారు.
గుంటూరు: రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జాతీయ జండాను ఆవిష్కరించారు. ఎంతో మంది మహానుభావుల త్యాగం ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. మహత్మాగాంధీ కన్న కలలను గత ఆరు సంవత్సరాలుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోది సాకారం చేస్తున్నారన్నారు. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు.