మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం ధర్మాన
ABN , First Publish Date - 2020-08-15T15:19:37+05:30 IST
కాకినాడ: కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా 74వ స్వాతంత్ర్య దినోత్సన వేడుకలు జరిగాయి.
కాకినాడ: కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా 74వ స్వాతంత్ర్య దినోత్సన వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జాతీయ జెండాను జిల్లా ఇన్చార్జ్ మంత్రి, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించారు. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. జోరు వానలో తడుస్తూనే ధర్మాన జెండాను ఆవిష్కరించారు. వర్షం కారణంగా వివిధ ప్రభుత్వశాఖల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు. కోవిడ్ కారణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పరిమితి సంఖ్యలో హాజరయ్యారు.