అంగరంగ వైభవంగా ధ్వజారోహణ
ABN , First Publish Date - 2021-03-04T05:21:44+05:30 IST
మందస వాసుదేవుని ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణ అంగరంగ వైభవంగా జరిగింది.
మందస:
మందస వాసుదేవుని ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వేదపండితుల
మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణ అంగరంగ వైభవంగా జరిగింది. త్రిదండి దేవనాథ
రామానుజ జీయర్స్వామి పర్యవేక్షణలో వాసుదేవ పెరుమాళ్ స్వామి
హనుమత్వాహనంలో ఆలయం నుంచి దక్షిణానికి వేంచేశారు. ఈ సందర్భంగా
గరుత్మంతుడిని బొమ్మ రూపంలో ధ్వజస్తంభానికి వేలాడదీసి పూజలు చేశారు.
సంతానంలేని వారికి గరుడ ప్రసాదం పంపిణీ చేశారు. సూర్యక్రాంతికి ఎదురుగా
భూతద్దాన్ని పెట్టి యాగశాలలో అగ్నిప్రతిష్ఠ హోమాలు చేపట్టారు. వాసుదేవుడ్ని
ఊరేగింపుగా వేదికపైకి తీసుకువచ్చి రామపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా
త్రిదండి వేదనాథ రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ
ఆధ్యాత్మికభావన పెంపొందించుకోవాలని కోరారు.