సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2020-06-03T11:06:29+05:30 IST
తమ సమస్యలు పరిష్కరించాలంటూ నెల్లూరు కార్పొరేషన్ కార్మికులు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన ..
మున్సిపల్ కార్మికుల ఆందోళన
నెల్లూరు(వైద్యం), జూన్ 2 : తమ సమస్యలు పరిష్కరించాలంటూ నెల్లూరు కార్పొరేషన్ కార్మికులు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. యూనియన్ నెల్లూరు రూరల్ కార్యదర్శి అల్లాడి గోపాల్ మాట్లాడుతూ కరోనా విపత్తులోనూ కార్మికులు పనిచేస్తుంటే వారికి రక్షణ కవచాలు అందచేయక పోవటం సరికాదన్నారు. మొదటి దశలో ఇచ్చిన గ్లౌజులు, మాస్క్లు పాడైపోయినా వాటితోనే పనిచేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులకు యూనిఫాం, చెప్పులు, సబ్బులు, నూనె, మాస్క్లు, గ్లౌజులు ఇవ్వలేదన్నారు. 20 శాతం అదనంగా కార్మికులను తీసుకోవాలన్న ప్రభుత్వ సూచనను కార్పొరేషన్ అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కొండా ప్రసాద్, కిన్నెర కుమార్, కండే కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, కాలేషా, మల్లిబాబు, చిట్టిబాబు, భారతి, వజ్రమ్మ, నాగలక్ష్మమ్మ తదితరుల పాల్గొన్నారు.