ఫీవర్‌ సర్వే తీరుపై ఆర్డీవో ఆగ్రహం

ABN , First Publish Date - 2021-08-06T06:42:24+05:30 IST

ఫీవర్‌ సర్వే సక్రమంగా జరగటం లేదని సిబ్బందిపై నూజివీడు ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫీవర్‌ సర్వే తీరుపై ఆర్డీవో ఆగ్రహం
సచివాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న ఆర్డీవో రాజ్యలక్ష్మి

ముసునూరు, ఆగస్టు 5 :  ఫీవర్‌ సర్వే సక్రమంగా జరగటం లేదని సిబ్బందిపై నూజివీడు ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసునూరు గ్రామ సచివాల యాన్ని గురువారం తనిఖీ చేశారు. సర్వేపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రికార్డులను పరిశీలించి, స్పందన ఆర్జీలను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తు న్నారు. ప్రజలకు అందిస్తున్న సేవలు తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 27 మంది వలంటరీలు వారికి కేటాయించిన 50 గృహల్లో నుంచి ఒక్కొక్కరు చొప్పున ప్రతిరోజు 27మందికి  కొవిడ్‌ పరీక్షలు చేయించా లని, ఈ ప్రక్రియను రేపటి నుంచి ప్రారంభించాలని మహిళా పోలీసులు, ఇన్‌చార్జి ఎంపీడీవో సాయిరామ్‌ను ఆదేశించారు. రైతుభరోసా కేంద్రంలో రికార్డులను  తనిఖీ చేసి,  పలుసూచనలు చేశారు. పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఏవో శివశంకర్‌ను ఆదేశించారు. 

రెవెన్యూ అధికారులపై ఆగ్రహం..

రెవెన్యూ అధికారుల పనితీరుపై ఆర్డీవో రాజ్యలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ముసునూరు స్పందనలో ఎక్కువ ఆర్జీలు  భూ సమస్యల పై వస్తున్నాయని, వీటి పరిష్కారానికి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్‌ఐ, డీటీ, తహసీల్దార్‌ పనితీరు వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని, త్వరగా పరిష్కరించకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్‌ ఎం.పాల్‌, ఏపీవో పౌలురాజు, డీటీ కిషోర్‌బాబు, ఆర్‌ఐ దీపిక, సర్వేయర్‌ వెంకటేశ్వరావు, ఇన్‌చార్జి ఈవోపీఆర్డీ వెంకటేశ్వరావు పాల్గొన్నారు.



Updated Date - 2021-08-06T06:42:24+05:30 IST