బీజేపీలో చేరిన ఐదుగురు తృణమూల్ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2021-03-09T00:40:10+05:30 IST

అధికార తృణమూల్‌కు మరో ఝలక్ తగిలింది. సరిగ్గా ఎన్నికల సమయంలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.

బీజేపీలో చేరిన ఐదుగురు తృణమూల్ ఎమ్మెల్యేలు

కోల్‌కతా : అధికార తృణమూల్‌కు మరో ఝలక్ తగిలింది. సరిగ్గా ఎన్నికల సమయంలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో వారు బీజేపీలో చేరారు. సోనాలీ గుహ, సితాల్ సర్దార్, దీపేందు విశ్వాస్, రవీంద్రనాథ్ భట్టాచార్య, జాటు లహరి బీజేపీలో చేరారు. మరోవైపు తృణమూల్ అభ్యర్థి సరళ ముర్ము కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. హబీబ్‌పూర్ నుంచి బరిలోకి దిగుతారని అధిష్ఠానం ప్రకటించింది. అయితే ఈమె బీజేపీలో చేరతారన్న వార్తలు రావడంతో ఆమెకు బదులు ప్రదీప్ భాస్కర్‌ను తృణమూల్ పోటీలోకి దింపింది. 


Updated Date - 2021-03-09T00:40:10+05:30 IST