మోటార్ల చోరీ కేసుల్లో ఐదుగురు నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2022-06-22T12:24:08+05:30 IST
ముత్తుకూరు మండలంలో పలుచోట్ల జరిగిన విద్యుత్ మోటార్ల చోరీ కేసుల్లో ముత్తుకూరు ఎస్ఐ శివకృష్ణారెడ్డి మంగళవారం ఐదుగురు నిందితులను
నెల్లూరు : ముత్తుకూరు మండలంలో పలుచోట్ల జరిగిన విద్యుత్ మోటార్ల చోరీ కేసుల్లో ముత్తుకూరు ఎస్ఐ శివకృష్ణారెడ్డి మంగళవారం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు మండలంలో నేలటూరు, మామిడిపూడి, బలిజపాలెం ప్రాంతాల్లో వరుసగా విద్యుత్ మోటార్ల చోరీలు జరిగాయి. కృష్ణపట్నం సీఐ వేమారెడ్డి, ఎస్ఐలు శివకృష్ణారెడ్డి, అంజిరెడ్డి సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. ముత్తుకూరుకు కొత్త దళితవాడకు చెందిన అరవ వినోద్, కనుపర్తిపాడుకు చెందిన గిద్దలూరు గోవర్దన్, ముత్తుకూరు ధర్మల్ పునరావాస కాలనీకి చెందిన గండవరపు మహేష్, నెల్లూరు వంశీ, తాండ్ర శ్రీనివాసులును నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు విద్యుత్ మోటార్లు, 4 ఏరియేటర్లు, 2 మోటారు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు సుబ్బారెడ్డిపాలెంలోని ఒక ఇంట్లో చోరీ చేసిన మూడు సవర్ల బంగారును స్వాధీనం చేసుకు న్నారు. నిందితులను అరెస్టు చేయడలో ప్రతిభ చూపిన సిబ్బందిని నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాఽథరెడ్డి రివార్డులు అందించి అభినందించారు.