ఇరువురు దొంగల అరెస్టు
ABN , First Publish Date - 2020-08-12T05:30:00+05:30 IST
ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల ప్రాంతాల్లో తిరుగుతూ రాత్రి పూట ఇళ్లల్లో సెల్ఫోన్లు, బంగారు వస్తువులు చోరీ చేసే షేక్ మస్తాన్, మట్టిదిన్నెల రామలక్ష్మణ్ అలియా
కడప(క్రైం), ఆగస్టు 12: ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల ప్రాంతాల్లో తిరుగుతూ రాత్రి పూట ఇళ్లల్లో సెల్ఫోన్లు, బంగారు వస్తువులు చోరీ చేసే షేక్ మస్తాన్, మట్టిదిన్నెల రామలక్ష్మణ్ అలియాస్ రాములును ప్రొద్దుటూరులో అరెస్టు చేసినట్లు కడప పీసీఎస్ సీఐ దేవకిరణ్కుమార్ తెలిపారు. కడప సీసీఎస్ పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారి వద్ద నుంచి రూ.2.50 లక్షలు విలువ చేసే 23 సెల్ఫోన్లు, ఒక జత బంగారు చెవి కమ్మలు స్వాధీనం చేసుకుని వారిని రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ప్రొద్దుటూరు సీఐ నాగరాజు, సీసీఎస్ ఎస్ఐలు శివప్రసాద్రెడ్డి, శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.