కరోనాపై పోరుకు పంచసూత్రాలు: లోకేశ్
ABN , First Publish Date - 2020-03-29T08:29:11+05:30 IST
కరోనాను ఎదుర్కోవడానికి ఐదు జాగ్రత్తలు పాటించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్...
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): కరోనాను ఎదుర్కోవడానికి ఐదు జాగ్రత్తలు పాటించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సూచించారు. ‘‘సాధ్యమైనంత వరకూ ఇంట్లోనే ఉండండి, తరచూ చేతులను కడుగుతూ ఉండండి, దగ్గినా.. తుమ్మినా మోచేతులను అడ్డుగాపెట్టుకోండి, ముఖాన్ని అసలు ముట్టుకోకండి, సామాజిక దూరం పాటించండి’’ అన్న ఐదు సూత్రాలను వివరించే వీడియోను తన ట్వీట్కు ఆయన జత చేశారు. మరో ట్వీట్లో... అలవాటైన చేతిని ఎక్కువగా వాడకపోవడం నుంచి కరోనాకి చెక్ పెట్టిందంటూ కొరియా దేశం అనుభవాన్ని లోకేశ్ ఉదహరించారు. అయితే ఇది చిన్న చిట్కా మాత్రమేనని, చేతులు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి అని లోకేశ్ పేర్కొన్నారు.