కువైత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు సహా ఐదుగురు మ‌ృతి

ABN , First Publish Date - 2021-08-22T15:37:45+05:30 IST

కువైత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి అబ్దాలి రోడ్‌పై రెండు బస్సులు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కువైత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు సహా ఐదుగురు మ‌ృతి

కువైత్ సిటీ: కువైత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి అబ్దాలి రోడ్‌పై రెండు బస్సులు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. అలాగే ఒకరు ఈజిప్టియన్‌గా, మరోకరిని బంగ్లాదేశీగా, ఇంకొకరిని నేపాలీగా గుర్తించారు. కాగా, గాయపడిన వారిని అంబులెన్సులు, ఎయిర్ అంబులెన్సుల్లో సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు కువైత్ అధికారులు తెలిపారు. ఇక మృతిచెందిన ఇద్దరు భారతీయుల్లో ఒకరు క్రౌన్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన బస్సు డ్రైవర్ జోసెఫ్ జేవియర్‌గా గుర్తించారు. జోసెఫ్‌ది కేరళ రాష్ట్రమని అధికారులు తెలియజేశారు. 

Updated Date - 2021-08-22T15:37:45+05:30 IST