హత్యకేసులో మైనర్‌ సహా ఐదుగురికి రిమాండ్‌

ABN , First Publish Date - 2020-06-05T09:48:39+05:30 IST

యువకుడి హత్య కేసులో మైనర్‌సహా ఐదుగురిని బహదూర్‌పురా పోలీసులు అరెస్టు చేశారు

హత్యకేసులో మైనర్‌ సహా ఐదుగురికి రిమాండ్‌

మదీన, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): యువకుడి హత్య కేసులో మైనర్‌సహా ఐదుగురిని బహదూర్‌పురా పోలీసులు అరెస్టు చేశారు. కాలాపత్తర్‌కు చెందిన షేక్‌ అహ్మద్‌ను గుర్తుతెలియని వ్యక్తులు గతనెల 30వ తేదీన గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు మహ్మద్‌ సాజిద్‌ఖాన్‌కు, షేక్‌ మహ్మద్‌కు గతలో వివాదం జరిగింది. ఇది మనసులో పెట్టుకున్న సాజిద్‌ఖాన్‌ అతడిపై పగ పెంచుకున్నాడు. నలుగురు స్నేహితులకు విషయం చెప్పాడు. పథకం ప్రకారం గతనెల 30న షేక్‌ అహ్మద్‌ ఇంటికి వెళ్లి అతడిని బయటకు తీసుకెళ్లారు. అదేరోజు రాత్రి 9.30 గంటల సమయంలో మీరాలం చెరువు నెక్లెస్‌ రోడ్డు వద్ద గొంతు కోసి హత్య చేసి పారిపోయారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మక్కా కాలనీ కాలాపత్తర్‌కు చెందిన మహ్మద్‌ సాజిద్‌ఖాన్‌(21), బషరత్‌నగర్‌ బస్తీకి  చెందిన సయ్యద్‌ సాదిఖ్‌(22), మహ్మద్‌  అజహర్‌ (20), అహ్మద్‌ ఖాలెద్‌(22), మైనర్‌ను అరెస్టు చేశారు. నిందితులను గురువారం రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2020-06-05T09:48:39+05:30 IST