వలస కార్మికులు ఐదుగురికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-06-07T10:42:05+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భార్యాభర్తలు, వారి ముగ్గురు పిల్లలతో కలిసి ముంబై వలస వెళ్లారు. లాక్‌డౌన్‌

వలస కార్మికులు ఐదుగురికి పాజిటివ్‌

బస్తీలో హోం క్వారంటైన్

ఆందోళనకు దిగిన బస్తీవాసులు


మన్సూరాబాద్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భార్యాభర్తలు, వారి ముగ్గురు పిల్లలతో కలిసి ముంబై వలస వెళ్లారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారు మే 31న నగరానికి వచ్చారు. వారి సమీప బంధువు ఒకరు కరోనాతో ముంబైలో మృతి చెందారు. ఈ క్రమంలో వారిని కింగ్‌ కోఠి అస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 2న వారందరికీ పాజిటివ్‌ వచ్చింది. రెండు రోజులు వారికి ఆస్పత్రిలోనే చికిత్స అందించిన వైద్యులు.. కొత్త మార్గదర్శకాల ప్రకారం గురువారం రాత్రి నాగోలు డివిజన్‌ ఫతుల్లాగూడ సర్వే నం.58 బస్తీకి తీసుకొచ్చారు.


వారి బంధువులకుసంబంధించిన ఓ ఇంట్లో క్వారంటైన్‌ చేశారు. పాజిటివ్‌ వ్యక్తులను బస్తీలోని ఇళ్ల మధ్యలో ఉంచడంతో.. బస్తీవాసులు ఆందోళన చేశారు. మరుసటి రోజు వారిని ఇతర ప్రాంతానికి తరలిస్తామని బస్తీవాసులకు పోలీసులు సిర్దిచెప్పారు. నెగెటివ్‌ వచ్చేంత వరకు వారు బయటకు వెళ్లే అవకాశం లేనందున బస్తీవాసులు  ఆందోళన చేందాల్సిన అవసరం లేదని వైద్యాధికారి డాక్టర్‌ మానస తెలిపారు.  

Updated Date - 2020-06-07T10:42:05+05:30 IST