Yamuna Expresswayపై కారు, ట్రక్కు ఢీ...ఐదుగురి మృతి
ABN , First Publish Date - 2022-05-12T16:39:28+05:30 IST
యమునా ఎక్స్ప్రెస్వేపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....
న్యూఢిల్లీ: యమునా ఎక్స్ప్రెస్వేపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వేగంగా వస్తున్న కారు-ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.గురువారం ఉదయం యమునా ఎక్స్ప్రెస్వేపై బొలెరో కారు ట్రక్కును ఢీకొట్టింది.మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గాయపడిన ఇద్దరు జేవార్లోని కైలాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.మైల్స్టోన్ సమీపంలోని జేవార్ టోల్ ప్లాజాకు 40 కిలోమీటర్ల ముందు ఆగ్రా నుంచి నోయిడాకు వెళుతున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతులంతా 50 ఏళ్ల వయసు పైబడిన వారేనని పోలీసులు చెప్పారు.పోలీసులకు సమాచారం అందించిన వెంటనే లారీని స్వాధీనం చేసుకున్నారు. అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు.