శ్రీనగర్ రోడ్డుపై 5 కిలోల ఐఈడీ పేలుడు పరికరం...ధ్వంసం చేసిన ఆర్మీ

ABN , First Publish Date - 2021-12-23T18:14:34+05:30 IST

జమ్మూకశ్మీరులో జమ్మూకశ్మీరులో జమ్మూకశ్మీరులో భారీ ప్రమాదం తప్పింది....

శ్రీనగర్ రోడ్డుపై 5 కిలోల ఐఈడీ పేలుడు పరికరం...ధ్వంసం చేసిన ఆర్మీ

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులో జమ్మూకశ్మీరులో జమ్మూకశ్మీరులో భారీ ప్రమాదం తప్పింది. ఉగ్రవాదులు శ్రీనగర్ రోడ్డుపై అమర్చిన 5కిలోల ఐఈడీ పేలుడు పరికరాన్ని సైనికులు కనుగొని దాన్ని ధ్వంసం చేశారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా గురువారం గాలిస్తుండగా శ్రీనగర్ వాన్ పోరా రోడ్డుపై అమర్చిన 5కిలోల ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం కనిపించింది. దీంతో ఆర్మీ బలగాలు ఈ ఐఈడీని ధ్వంసం చేశారు. ఈ బాంబును నిర్వీర్య బృందం ధ్వంసం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఆర్మీ గాలింపు అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉగ్రవాదులు ఈ బాంబును అమర్పినట్లు అనుమానిస్తున్నారు. భద్రతాధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. 


Updated Date - 2021-12-23T18:14:34+05:30 IST