మొబైల్ యాప్‌లో కేంద్ర బడ్జెట్...ఐదు ఆసక్తికర అంశాలు

ABN , First Publish Date - 2022-02-01T16:20:57+05:30 IST

నిర్మలాసీతారామన్ కేంద్ర ఆర్థికమంత్రి అయ్యాక నాల్గవసారి కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు...

మొబైల్ యాప్‌లో కేంద్ర బడ్జెట్...ఐదు ఆసక్తికర అంశాలు

4వసారి బడ్జెట్ సమర్పిస్తున్న నిర్మలా సీతారామన్ 

న్యూఢిల్లీ: నిర్మలాసీతారామన్ కేంద్ర ఆర్థికమంత్రి అయ్యాక నాల్గవసారి కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు.పార్లమెంటులో మొట్టమొదటిసారి ఇందిరాగాంధీ 1970-71 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను సమర్పించారు. అనంతరం 2019లో కేంద్ర బడ్జెట్ ను సమర్పించిన రెండవ మహిళగా నిర్మలా రికార్డు సృష్టించారు.నిర్మలా సీతారామన్ 2 గంటల 42 నిమిషాల పాటు 2020-21 సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు నెలకొల్పారు. గతంలో మరో రెండు పేజీల బడ్జెట్ ప్రసంగం మిగిలి ఉండగానే అస్వస్థత కారణంగా ముగించాల్సి వచ్చింది. 2019లో నిర్మలాసీతారామన్ 2 గంటల 17 నిమిషాల పాటు మాట్లాడి తన తొలి బడ్జెట్ ప్రసంగం రికార్డు బద్దలు కొట్టారు.


2021లో మొదటిసారి పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కరోనా వైరస్ భయం వల్ల నార్త్ బ్లాక్ లోని ఆర్థిక మంత్రిత్వశాఖ అంతర్గత ప్రింటింగ్ ప్రెస్ లో ముంద్రించలేదు. బ్రీఫ్ కేస్ లో బడ్జెట్ పేపర్లను తీసుకువచ్చే వలసరాజ్యాల సంప్రదాయానికి స్వస్తి చెప్పి బడ్జెట్ బాహాఖాతా లెడ్జరును ఎరుపు రంగు గుడ్డ ఫోల్డరులో ఉంచి స్ట్రింగుతో కట్టారు. మొట్టమొదటిసారి 2021 -22 లో యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ను ప్రారంభించారు.పార్లమెంట్‌లో మంగళవారం బడ్జెట్ సమర్పణ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేంద్ర బడ్జెట్ 2022-23 మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులో వస్తోంది.


Updated Date - 2022-02-01T16:20:57+05:30 IST