ఐదు జిల్లాల్లో పదిమందిలోపు Covid బాధితులు

ABN , First Publish Date - 2022-02-17T17:15:36+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,894 మందికి పాజిటివ్‌ ని ర్ధారణ అయింది. ఐదు జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదు కాగా బెంగళూరులో 835 మంది, మైసూరులో 125 మంది, ఇతర

ఐదు జిల్లాల్లో పదిమందిలోపు Covid బాధితులు

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,894 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఐదు జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదు కాగా బెంగళూరులో 835 మంది, మైసూరులో 125 మంది, ఇతర జిల్లాల్లో వందలోపు కేసులు నమోదయ్యాయి. 5,418 మంది కోలుకోగా 24 మంది మృతిచెందారు. వీరిలో బెంగళూరులో నలుగురు, బళ్లారిలో ముగ్గురు, నాలుగు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తొమ్మిది జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,284మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 9,955మంది ఉన్నారు.

Updated Date - 2022-02-17T17:15:36+05:30 IST