Jammu & Kashmir: లోయలో పడిన టెంపో ట్రావెలర్...ఐదుగురి మృతి

ABN , First Publish Date - 2022-08-05T18:32:15+05:30 IST

జమ్మూకశ్మీరులోని రాంబన్ జిల్లాలో ఓ టెంపో ట్రాలీ లోయలో పడిన ప్రమాద ఘటనలో ఐదుగురు మరణించగా...

Jammu & Kashmir: లోయలో పడిన టెంపో ట్రావెలర్...ఐదుగురి మృతి

శ్రీనగర్: జమ్మూకశ్మీరులోని రాంబన్ జిల్లాలో ఓ టెంపో ట్రాలీ లోయలో పడిన ప్రమాద ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. రాంబన్ జిల్లాలో జమ్మూ నుంచి బనీహాల్ కు టెంపో ట్రాలీలో వెళుతుండగా ప్రమాదవశాత్తూ లోయలో పడింది. లోయలో పడే ముందు టెంపో ఓ కారును ఢీకొందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బ్రేకులు ఫెయిలవడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. 


Updated Date - 2022-08-05T18:32:15+05:30 IST