ఐదు రోజులు మోస్తారు వర్షాలు
ABN , First Publish Date - 2022-05-29T15:50:51+05:30 IST
ఉష్ణచలనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఐదు రోజులు మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం
పెరంబూర్(చెన్నై): ఉష్ణచలనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఐదు రోజులు మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది. చెన్నైలో ఆకాశం మేఘావృతంగా ఉంటూ సాయంత్రం, రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షం కురుస్తుందని, పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలో నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.