దేవుపల్లిలో ఐదిళ్లు దగ్ధం
ABN , First Publish Date - 2021-02-27T05:33:12+05:30 IST
దేవుపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు పూరిళ్ల అగ్నికి ఆహుతయ్యాయి.
బొండపల్లి: దేవుపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు పూరిళ్ల అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక కేంద్ర అధికారి కె.అప్పారావు తెలిపి న వివరాలు ఇలా ఉన్నాయి. దేవుపల్లి గ్రామంలోగల ఎస్సీ కోలనీలో పసుపు రెడ్డి కొండమ్మ ఇంటిలోగల విద్యుత్ వైర్లు షార్ట్సర్క్యూట్తో నిప్పురవ్వలు ఎగిసి పడి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో చుట్టుపక్కలగల పసుపులేటి శంకర రావు, గొర్లె గోపాలమ్మ, రొంగళి, గౌరమ్మ, గొర్లె అప్పన్నకు చెందిన ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదంతో నిత్యవసర సరుకులతో పాటు బట్టలు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.2లక్షల 50వేల ఆస్తి నష్టం సంభవించినట్టు ప్రాథ మిక అంచనా వేశారు. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందిం చడంతో పెను ప్రమాదం తప్పింది.