హత్య కేసులో ఐదుగురి అరెస్టు
ABN , First Publish Date - 2020-08-04T10:58:42+05:30 IST
భూ వివాదంతో కొత్తగొల్లపల్లెలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు ..
తవణంపల్లె, ఆగస్టు 3: భూ వివాదంతో కొత్తగొల్లపల్లెలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు. కొత్తగొల్లపల్లెకు చెందిన వాసు, ఉమాకాంత్ మధ్య కొంత కాలంగా భూ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గత నెల 27న ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో వాసు వర్గానికి చెందిన శంకరయ్య(64) తీవ్రంగా గాయపడ్డాడు.
ఆయన చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో హత్య కేసును నమోదు చేసిన చిత్తూరు వెస్ట్ సీఐ లక్ష్మీకాంత్రెడ్డి దర్యాప్తు జరిపారు. నిందితులైన ఉమాకాంత్(29), ఎల్లప్ప(65), దేవరాజులు(30), విజయకుమార్(25), శంకరయ్య(61)ను సోమవారం కె.పట్నం సమీపంలోని తిరుపతి హైవే రోడ్డు వద్ద అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.