వేలూరులో ఐదు ఆర్టీసీ బస్సుల సీజ్‌

ABN , First Publish Date - 2021-01-14T06:20:27+05:30 IST

పర్మిట్లు లేవంటూ వేలూరు ఆర్టీవో అధికారులు చిత్తూరు జిల్లాకు చెందిన ఐదు ఆర్టీసీ బస్సులను సీజ్‌ చేశారు.

వేలూరులో ఐదు ఆర్టీసీ బస్సుల సీజ్‌
వేలూరు ఆర్టీవో కార్యాలయంలో చిత్తూరు-2 డిపో బస్సులు

చిత్తూరు రూరల్‌, జనవరి 13: పర్మిట్లు లేవంటూ వేలూరు ఆర్టీవో అధికారులు ఏపీఎస్సార్టీసీకి చెందిన ఐదు బస్సులను బుధవారం సీజ్‌ చేశారు. వీటిలో చిత్తూరు-2 డిపోకు చెందిన రెండు, తిరుమల డిపోకు చెందిన మూడు బస్సులున్నాయి. అయితే వాహనాలకు అన్నిరకాల పర్మిట్లు ఉన్నట్లు చిత్తూరు-2 డిపో మేనేజర్‌ కిరణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. వేలూరు అధికారులకు అనుమతులకు సంబంధించిన పత్రాలు పంపినట్లు తెలిపారు. 

Updated Date - 2021-01-14T06:20:27+05:30 IST