క్రీడల అభ్యున్నతికే ఫిట్ ఇండియా
ABN , First Publish Date - 2020-02-20T07:14:43+05:30 IST
క్రీడాభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా మూమెంట్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్కుమార్ తెలిపారు.
మెదక్ అర్బన్, ఫిబ్రవరి19: క్రీడాభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా మూమెంట్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల పీడీ, పీఈటీలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. గతేడాది ఆగస్టు 29న ఫిట్ ఇండియా మూమెంట్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారన్నారు. రాష్ట్ర స్కూల్స్ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రార్ధన సమయంలో ఫిట్ ఇండియా కార్యక్రమాలను తప్పని సరిగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమాల వివరాలను సంబంధిత వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. పాఠశాలల్లో చేపట్టే కార్యక్రమాలను కోఆర్డినేటర్ నాగరాజు ఫవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి నాగేశ్వర్ నాయక్, ఎస్జీఎఫ్ కార్యదర్శి కిశోర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, అఽథ్లెటిక్ అసోషియేషన్ జిల్లా సెక్రటరీ మధుసూదన్, పీడీ, పీఈటీలు పాల్గొన్నారు.