ఏనుగు చెవిలాంటి భారీ చేప... ఖరీదు వింటే కంగుతింటారు!
ABN , First Publish Date - 2020-07-29T17:59:49+05:30 IST
పశ్చిమబెంగాల్లోని దిఘా తీరంలో ఈరోజు ఉదయం 780 కిలోల బరువైన జెయింట్ ఫిష్ను మత్స్యకారులు పట్టుకున్నారు. వారు ఈ చేపను...
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని దిఘా తీరంలో ఈరోజు ఉదయం 780 కిలోల బరువైన జెయింట్ ఫిష్ను మత్స్యకారులు పట్టుకున్నారు. వారు ఈ చేపను శంకర్ ఫిష్ అని పిలుస్తుంటారు. ఈ చేప... ఏనుగు చెవి తరహాలో 8 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు కలిగివుంది. మత్స్యకారులు ఈ చేపను రాష్ట్రంలోని ఒక చేపల వ్యాపార సంస్థకు రూ. 50,000 కు విక్రయించారు. తమకు లభ్యమైన అతి బరువైన చేప ఇదేనని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చేప మాంటా రే చేపలా కనిపిస్తుంది. ఇటువంటి చేపలు రే కుటుంబానికి చెందినవి. తూర్పు భారతదేశంలోని అన్నిరకాల రే చేపలను శంకర్ చేప అని పిలుస్తుంటారు. కాగా ఈ భారీ చేపను చూసేందుకు జనం గుమిగూడారు. ఈ చేపకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. శంకర్ చేపలను బెంగాల్లో మాంసాహారులు ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఈ ఏడాది మార్చిలోనూ దిఘా తీరంలో మత్స్యకారులను ఇటువంటి 300 కిలోల బరువున్న చేపను పట్టుకున్నారు.